నవోదయం 2.0 ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేలా చర్యలు తీసుకుంటున్నాం–మంత్రి కొల్లు రవీంద్ర

శ్రీ బాలాజీ జిల్లా సామాన్యుడి టీవీ వార్త:రాష్ట్ర స్థాయిలోని ఎక్సైజ్ అధికారులతో సమీక్ష సమావేశం కమిషనర్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తో కలిసి ముందుకు వెళ్ళాల్సిన విధానంపై నేడు చాలా విస్తృతంగా సమీక్ష చేస్తున్నాం అని 2014-19 మధ్య ప్రజలకు ఇబ్బంది లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి అమలు చేశాం అని తేలిపారు.


             గత  ప్రభుత్వం 2019- 24 మధ్య కాలంలో ఐదేళ్లు ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారు అని మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి.. మద్యం వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారు.కొత్త పాలసీ పేరుతో వ్యవస్థ మొత్తాన్ని విచ్చిన్నం చేశారు అని అన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీల నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు అని తేలిపారు.ఎన్ ఫోర్సు మెంట్ లేకుండా చేసి మద్యం అక్రమ వ్యాపారాలకు తెరలేపారు అని .మల్టీ నేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని మార్కెట్ నుంచి దూరం చేసి, తమ సొంత బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దారు అని  గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంతో ప్రభుత్వ ఆదాయం.. ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయి అని అన్నారు.


              ఏపీలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా పెరిగింది అని సరిహద్దు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరగగా మన రాష్ట్రంలో మద్యం ఆదాయం తీవ్రంగా కోల్పోయాం అని నాసిరకం సొంత బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడగా, పలువురు కిడ్నీ, లివర్ సమస్యల బారిన పడ్డారు అని అన్నారు.


                 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ ద్వారా నాసిరకం బ్రాండ్లకు స్వస్తి పలకడం జరిగింది అని  6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టాం అని తేలిపారు.అత్యంత పారదర్శకంగా డిప్ నిర్వహించి మద్యం షాపుల్ని కేటాయించాం అని పారదర్శక లైసెన్స్ కేటాయింపు కారణంగా సుమారు 90వేల దరఖాస్తులు రాగా, రూ.1800 కోట్ల ఆదాయం వచ్చింది అని అన్నారు.పాత బ్రాండ్లను తిరిగి పునరుద్ధరించాం అని ప్రజలకు ఆరోగ్యం.. ప్రభుత్వానికి ఆదాయం కాపాడే విధంగా పాలసీని తీసుకొచ్చాం అని 350కి పైగా బ్రాండ్లు ఏపీలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం అని తేలిపారు.మద్యం ధరలను కూడా పొరుగు రాష్ట్రాలతో సమానంగా చేయడం వలన అక్రమ రవాణా ఆగింది అని గతంలో ఉన్న బెల్టు షాపులపై కూడా చర్యలు తీసుకోవడంతో దాదాపు నిర్మూలించాం అని గత ఐదేళ్లు ఎక్సైజ్ శాఖను విచ్చిన్నం చేసి SEB ఏర్పాటుతో ఎన్ఫోర్స్మెంట్ కూడా సరిగా లేకుండా పోయింది అని తేలిపారు. నవోదయం 2.0 ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేలా చర్యలు తీసుకుంటున్నాం అని మొన్నటి వరకు గంజాయి అక్రమ రవాణా కారణంగా యువత జీవితాలు చిత్తయ్యాయి అని  గంజాయి నిర్మూలన కోసం హోమ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసుకున్నాం అని అన్నారు.

                         టూరిజం పెంపు కోసం 3స్టార్ హోటల్ కి లైసెన్స్ ఫీజు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాం అని గతంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 32 వేల కోట్ల అప్పులు చేశారు అని అన్నారు.గత ఐదేళ్ల అక్రమాల గురించి ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారు అని.క్యాష్ అండ్ క్యారీ.. విధానంతో దాదాపు లక్ష కోట్ల లావాదేవీలు జరగడంపై సీఐడీ విచారణ జరుగుతోంది అని కానీ కూటమి పాలనలో అన్ని షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉంచి పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం అని తేలిపారు.మరోవైపు ఆన్ లైన్ ఇండెంట్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో పారదర్శకతకు శ్రీకారం చుట్టాం అని బెల్ట్ షాప్ ఉంటే… మద్యం సరఫరా చేసిన వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Scroll to Top