విజయవాడ(ఏప్రిల్ 03):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ART కేంద్రాలలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ నర్స్ లకు గత మూడు రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించామని జాయింట్ డైరెక్టర్ (CST) డా. టి. మంజుల చెప్పారు. విజయవాడ ఐలాపురం హోటల్ లో గురువారం శిక్షణ ముగింపు కార్యక్రమంలో డా. మంజుల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ Dr శ్రీమతి సిరి IAS ఆధ్వర్యంలో 40 మంది మెడికల్ ఆఫీసర్స్, 40 మంది స్టాఫ్ నర్స్ లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకూ ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని డా. మంజుల తెలిపారు.
ఈసందర్భంగా డా T . మంజుల మాట్లాడుతూ ముఖ్యంగా మనం హెచ్ఐవి తో జీవిస్తున్న వ్యక్తులతో ప్రత్యక్షంగా వారితో కలిసి పనిచేస్తున్నప్పుడు వారి పట్ల ఎటువంటి వివక్షత లేకుండా సరైన సమాచారము మరియు చికిత్స వారికి అందించాలన్నారు. వారి పట్ల అంకితభావంతో పనిచేసి వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మందులు తీసుకునే విధంగా వాతావరణాన్ని మన ART కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మెడికల్ ఆఫీసర్స్ పైన ఉంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఎంపిఆర్ పంపించేటప్పుడు డేటా మేనేజర్ తో కలిసి చూసి ఇండికేటర్ వేసి చెక్ చేసుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని ఇండికేటర్స్ ప్రకారం గా రిపోర్టింగ్ మరియు డాక్యుమెంటేషన్ అనేది ఎలా చేయాలి అనేది ఈ శిక్షణలో వివరించడం జరిగిందన్నారు. .
మన రాష్ట్రంలో ART మందులు మొదలుపెట్టి మధ్యలోనే హాజరు కాకుండా ఉండే వారిని గుర్తించి వారందరికి తిరిగి వైద్య సేవలు కొనసాగించే విధంగా వారికి కౌన్సిలింగ్ ని అందించే విధంగా చూడాలని డా. మంజుల అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతి దేవి మాట్లాడుతూ మందులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆ బాధ్యత మెడికల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ నర్స్ లపై ఉందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డాక్టర్ భాగ్యలక్ష్మి, జాయింట్ డైరెక్టర్. Dr చక్రవర్తి, డిప్యూటీ డైరెక్టర్ IEC మరియు డాక్టర్ రాజేంద్రప్రసాద్, P E P F A R కోఆర్డినేటర్, APSACS స్టాఫ్ మరియు share ఇండియా స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.