అమరావతి, సామాన్యుడు టివి వార్త: రాజధానిలోని అనంతవరం లో మంత్రి నారాయణ పర్యటన.
అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను పరిశీలించిన మంత్రి,సీఆర్డీయే,మైనింగ్ శాఖల అధికారులు.
…..నారాయణ,మంత్రి కామెంట్స్…
గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయి.
న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టింది.
68 పనులకు సంబంధించి 42360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి.
ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయే కు కేటాయించింది.
గతంలో అనంతవరం కొండను సీఆర్డీయే కు కేటాయించారు…అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారు.
ఇక్కడ భూమిని కూడా ఏదోక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నాం.
రాజధాని లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది సీఎం చంద్రబాబు గారి ఆలోచన
మంగళగిరి,తాడేపల్లి,గుంటూరు,విజయవాడ లను కలిపి మెగాసిటీ గా చేయాలనేది లక్ష్యం
ఎయిర్పోర్ట్ కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరం
ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే 30 వేల ఎకరాలు అవసరం
భూసేకరణ చేస్తే రిజిస్ట్రేషన్ ధర పై రెండున్నర రెట్లు మాత్రమే వస్తుంది
భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని…సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే లు కోరారు
.
ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం.
రాజధానిలో 92 పనులను 64,912 కోట్లతో చేస్తున్నాం.








