కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తీవ్రంగా స్పందించింన ధర్మాసనం..

తెలంగాణ:హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరుగగా.. తెలంగాణ ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలన్న జస్టిస్ బీఆర్ గవాయ్. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలన్న జస్టిస్ గవాయ్.అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు చెప్పిన ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. 

తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని వివరించిన అమికస్ క్యూరీ.అనుమతులు తీసుకున్నారా లేదా.. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న జస్టిస్ గవాయ్.మీరు చీఫ్ సెక్రటరీని కఠినమైన చర్య నుండి కాపాడాలనుకుంటే, ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ఒక ప్రణాళికతో ముందుకు రావాలన్న ధర్మాసనం.

1996 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకొమని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.మూడు రోజుల సెలవుల్లో అలా చేయడానికి అంత తొందర ఏమిటి.ఆ సెలవుల్లోనే బుల్డోజర్లు తీసుకొచ్చారు.పర్యావరణాన్ని కాపాడటానికి మేము ఇక్కడ ఉన్నాము.రూ. 10 వేల కోట్లకు మార్టిగేజ్ చేసారని సీఈసీ నివేదికలో చెప్పిందన్న అమికస్ క్యూరీ.

భూములను మార్టిగేజ్ చేసారా లేదా, అమ్ముకున్నారో లేదో మాకు మాకు అనవసరం.చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యం అన్న జస్టిస్ గవాయ్.2004 నుంచి ఈ భూముల వ్యవహారం, కోర్టుల్లో ఉన్న పరిస్థితి, తర్వాత చుట్టుపక్కల జరిగిన అభివృద్ధి, ఐటి పార్కు, ఇతర ప్రాజెక్టులు వివరాలు చెప్పిన అభిషేక్ మను సింఘ్వి.

వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయం పైనే తాము దృష్టి సారించాలని అంటున్నామన్న జస్టిస్ గవాయ్.వంద ఎకరాల్లో జంతువులకు తీవ్ర నష్టం జరుగుతుందన్న మరో న్యాయవాది నిరంజన్ రెడ్డి.సీఎస్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందన్న నిరంజన్.వంద ఎకరాలు మార్టిగేజ్ చేసి, చెట్లు కొట్టేసి ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటి పార్క్ అని చెపుతున్నారన్న నిరంజన్ రెడ్డి.

పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తామన్న జస్టిస్ గవాయ్.ఆ భూముల్లో ఉన్న జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలన్న జస్టిస్ గవాయ్.సీఈసీ నివేదికలో మార్టిగేజ్ వ్యవహారం స్పష్టంగా ఉందన్న అమికస్ క్యూరీ.రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టినా.. ఈ భూములను వెంటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పజెప్పాలని కోరిన అమికస్ క్యూరీ

మే 15వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.మార్టిగేజ్ వ్యవహారం తమకు సంబంధం లేదన్న జస్టిస్ గవాయ్.పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా… 1996 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది ముఖ్యమని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్దరిస్తారో అణా విషయం మాకు ప్రధానం అన్న జస్టిస్ గవాయ్.మిగిలిన వ్యవహారాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన జస్టిస్ గవాయ్.

సీఈసీ నివేదికపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చిన ధర్మాసనం.ఆర్టికల్ 142 కింద పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తామన్న జస్టిస్ బిఆర్ గవాయ్.పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంత కాలంలో చేస్తారు, జంతు జలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం.నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్టేటస్‌కో కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు.తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మీ అధికారులను తాత్కాలికంగా జైలుకు పంపిస్తాం. ఈ మధ్యకాలంలో అక్కడ ఒక్క చెట్టైనా కొట్టరాదు. బుల్డోజర్లు తొలగించబడ్డాయా అని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు.

100 ఎకరాల్లో జరిగిన నష్టం కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించేందుకు అవసరమైన తక్షణ చర్యలను పరిశీలించి, అమలులోకి తీసుకురావాలని తెలంగాణ వన్యప్రాణి సంరక్షణాధికారిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Scroll to Top